తొర్రూరు ప్రతినిధి పి సి డబ్ల్యూ న్యూస్: పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ప్రమాదవశాత్తున గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని తొర్రూరు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అభిమానులు. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆంజనేయ ఆలయంలో బేడ (బుడగ) జంగం రిజర్వేషన్ పోరాట సమాఖ్య సంఘం రాష్ట్ర నాయకులు పస్థం సాంబ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పస్తం సాంబ మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తోరూర్ మున్సిపాలిటీ అనుకోని విధంగా ప్రమాదానికి గురి కావడం ఎంతోమంది అభిమానులు తీవ్ర విచారణకు లోనయ్యారని అన్నారు. హుటాహుటిన హైదరాబాదుకు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యులు మంచి మందులను అందించి మేడం త్వరగా కోలుకునే విధంగా చూడాలని కోరుతున్నారు. పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డికి ఆమె త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల్లోకి వచ్చి అమూల్యమైన సేవలు అందించాలని శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పాలకుర్తి ప్రజల తరఫున బేడ బుడగ జంగం రిజర్వేషన్ పోరాట సమాఖ్య సంఘం తరఫున వేడుకుంటున్నామని అన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]