హనుమకొండ: తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా వాజిద్ హుస్సేన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ లోని నేరళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో శనివారం టి ఎస్ ఎస్ ఉద్యోగ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా షేక్ వాజిద్ హుస్సేన్ జాఫర్, ఉపాధ్యక్షులుగా పుల్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శులుగా వాంకుడోత్ రమేష్, కార్యదర్శిగా యోగానందం, కోశాధికారిగా కొండ సారంగపాణి, ప్రచార కార్యదర్శిగా బూడిద సురేందర్, మహిళా ప్రతినిధిగా ఎండీ రజియా, కార్యవర్గ సభ్యులుగా గడ్డం కళావతి, పుట్ట జానకి, అంబాల జయ, బొంకూరి రాణి, బొంకురి ప్రభాకర్ లను ఎన్నుకున్నారు. ఈ సమావేశం లో ముఖ్య సలహాదారుడు డా. వెన్నెల శ్రీనాథ్, మారేపల్లి జాన్, గౌరవ అధ్యక్షులు దార దేవేందర్, టి ఎస్ ఎస్ కళాకారులు పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైన వాజిద్ మాట్లాడుతూ సంఘం బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటివల 30 శాతం పీఆర్సీ అమలుచేస్తు పెరిగిన జీతం ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]