సంగెం/ జూన్ 6 (పిసిడబ్ల్యూ న్యూస్): సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట గ్రామంలో కొద్ది రోజుల్లో క్రితం కరెంట్ షాక్ తో కడారి సూరయ్య అనే వ్యక్తి మరణించడం జరిగింది కడారి సూరయ్య గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తూ గ్రామంలో విద్యుత్ కి సంబంధించిన పనులు చేస్తూ నిరంతరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేకమైనటువంటి సేవలు చేసేవారు అకస్మాత్తుగా చనిపోవడం వల్ల గ్రామంలోవిషాద ఛాయలు అందుకున్నాయి అతని యొక్క సేవలను గుర్తూ చేసుకుని సూరయ్య కుంటుంబానికి అండగా ఉందామని సోషల్ మీడియా వేదికగా గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు కొందరు వారికి తోచినవిధంగా వాట్సాప్ వేదికగా ఫోన్ పే ద్వారా ఆర్ధిక సహాయం గా పంపించారు దీని ద్వారా వచ్చిన మొత్తం డబ్బులు 20వేల రూపాయలను శుక్రవారం రోజు అతని కుమారునికి,కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనగాం శ్రీనివాస్, షాబోతు శ్రీనివాస్, కంది కిషన్ , జనగాం మల్లికార్జున్ , ముజ్జిగ అనిల్ రావు కాగితాల పరమాత్మ చారి తదితరులు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]