పరకాల. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి భారీ స్పందన వస్తోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ బస్సులో చూసిన 70 శాతం వరకు మహిళలే కనిపిస్తున్నారు. పలు రూట్లలో బస్ సర్వీసులు సరిపోకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వెల్లువెత్తుతున్నాయి. మహిళల సీట్లు నిండిపోవడంతో పురుషుల సీట్లలోనూ కూర్చుండడంతో పురుషులకు సీట్లు లేకుండా పోతున్నాయి. దీంతో వారు మేము టికెట్ కొనుగోలు చేసి బస్ ఎక్కిన మేము నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని పురుష ప్రయాణికులు వాపోతున్నారు. అంతేకాకుండా సీట్ల కోసం పలుచోట్ల పంచాయితీలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. పండుగ సమయాల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు కొనసాగించారు. ఈ క్రమంలో సీటులో కూర్చునే విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ మొదలైంది. ఇది పెరిగి పెద్దది కావడంతో ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. బస్సుల్లో దుర్భసలాడుకోవడం, కొట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచి, పురుషులు కూడా సగర్వంగా కూర్చుని ప్రయాణం చేసే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచాలి

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]