PCW News

ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మేకల సుమన్

వరంగల్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల బరిలో ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిన్న జరిగిన ఒక మీడియా ప్రకటనలో తెలియజేశారు. అందులో భాగంగా వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన మేకల సుమన్ ని డా,, విశారదన్ మహరాజ్  ప్రకటించారు. తదనంతరం ధర్మ సమాజ్ పార్టీ బీ ఫామ్ అందజేశారు. ఈ ఎన్నికల్లో కోటానుకోట్ల డబ్బు ఉన్న బీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్ అగ్రకుల పార్టీల మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, 93% ప్రజల తరుపున నిరుపేద కుటుంబంలో పుట్టిన మేకల సుమన్ ఎన్నికల యుద్ధంలో నిలబడుతున్న శుభ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నడికూడ మండల కమిటీ పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. మండల కన్వీనర్ కోడెపాక ప్రతాప్ .కావున ఈ ఎన్నికల్లో అణగారిన ప్రజలంతా ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు చెప్పుల గుర్తు మీద ఓటు వేసి గెలిపించగలరని ప్రజలని కోరారు. కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు మంతేపురి తిరుపతి, ప్రవీణ్, బుస్స తిరుపతి,దినేష్, దొగ్గేల తిరుపతి తదితరులు.