PCW News

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా చల్లా ధర్మారెడ్డి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో మంగలపల్లి రాజయ్య, కుమారస్వామి, నగేష్, రమేష్ తదితులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుదన్ రెడ్డి, నాయకులు ఆముదాలపల్లి అశోక్, పల్లెబోయిన రాజు, ఆలేటి రవీందర్, బుర్రి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.