PCW News

కాంగ్రెస్ తోనే దేశానికి మేలు..

హనుమకొండ, పి సి డబ్ల్యూ న్యూస్ : అన్ని వర్గాల వారు అభివృద్ధి పొలాలు పొందాలంటే.. కాంగ్రెస్తోనే సాధ్యమని, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కార్యకర్తలు సైనికుల పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా హంటర్ రోడ్ లో ని డి-కన్వెన్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్, రాష్ట్ర గ్రంధాలయ శాఖ అధ్యక్షులు రియాజ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, మహిళా నాయకురాల్లు, వివిధ జిల్లాల డివిజన్ నాయకులు, నాయకులు కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు. వరంగల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే.. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అణగారిన వర్గాల్లో జీవితాల్లో వెలుగులు నిండాలంటే.. కాంగ్రెస్తోనే సాధ్యమని వారన్నారు. బిఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీ ల అమలుతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అభ్యర్థి కావ్య, ముఖ్య నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులు, కార్పొరేటర్లు, మాది కార్పోరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.