PCW News

పంచాయతీ కార్యదర్శులకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఘన సత్కరించిన ఎంపీడీవో 

పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ సిబ్బందికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 2023/ 2024 సంవత్సరంలో మండలంలోని 10 గ్రామాలలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా నిర్వహించి జిల్లాలో ఉత్తమ స్థాయిలో నిలిచిన లక్ష్మీపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి రిజ్వానా ఫీల్డ్ అసిస్టెంట్ చిరంజీవి నాగారం పంచాయతీ కార్యదర్శి రమేష్ ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం కోమల మరియు పోచారం పంచాయతీ కార్యదర్శి కవిత ఫీల్డ్ అసిస్టెంట్ మురళి కి ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు ఎంపీఓ భాస్కర్ ఏపీవో ఇందిర వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు తనదైన శైలిలో పనిచేస్తూ ఉపాధి హామీ సిబ్బందికి పని కల్పిస్తూ మండలానికి మంచి పేరు తీసుకువచ్చిన శుభ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించడం జరిగిందని ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈసీ రజనీకాంత్ టెక్నికల్ అసిస్టెంట్ సుమలత 10 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు 10 గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.