హనుమకొండ. దళిత ద్రోహి కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ను ఓడిచాలని బిజెపి. రాష్ట్ర నాయకుడు చిలుక విజయ రావు ప్రజలను కోరారు. బుధవారం రోజున హనుమకొండ లోని బాల సముద్రం ప్రెస్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిలుక విజయ రావు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య ను ఓడించాలని వరంగల్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కడియం శ్రీహరి వూసరవెల్లి లాగా పార్టీలు మార్స్తు దళితులకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి దళితులను అణగ తొక్కుతూ అధికారం కోసం నీచానికి ఓడకడుతాడని అటువంటి శ్రీహరిని దళితులు, బి.సీ.లు,అణగారిన వర్గాలు బుద్ది చెప్పాలని వరంగల్ జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. బి.జె.పి.అభ్యర్థి ఆరూరి రమేష్ ను అధిక మెజారిటీ తో గెలిపిస్తే వరంగల్ జిల్లా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని, రాష్ట్రాన్ని అన్నిరంగాలలో అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీ.జె. పి. నాయకులు బొజ్జపల్లి సుభాష్, జన్నూ ప్రభాకర్ ,మార్టిన్ లూత ర్, జన్ను మధు.లు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]