నడికూడ, ఫిబ్రవరి 22 (పిసిడబ్ల్యూ న్యూస్): కంటాత్మకూర్ సమ్మక్క సారలమ్మ సేవలో భాగంగా కౌకొండ గ్రామ మాజీ సర్పంచ్ మేకల రమేష్ సోదరుడు డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ మౌనిక దంపతులు శ్రీ సమ్మక్క సరళమ్మ భక్తులకు ఉచిత మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నట్లు మాజీ సర్పంచ్ తెలిపారు.ఈ సందర్భంగా మేకల రమేష్ (మాజీ సర్పంచ్) మాట్లాడుతూ కంటాత్మకూర్ జాతర భక్తుల సౌకర్యార్థం గత రెండు జాతరలో డాక్టర్ చంద్రమోహన్ తన వంతు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు ఫిబ్రవరి 21 నుండి 25 వరకు కొనసాగే జాతరలో మినరల్ వాటర్ కేంద్రంలో భక్తులు ఉచిత మినరల్ వాటర్ అందజేస్తామన్నారు సమాజంలో సేవ చేసేందుకు ఎల్లవేళలా ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]