PCW News

బొగ్గు ఉత్పత్తిలో ఆదర్శంగా జెకె 5 ఉపరితల గని

ఇల్లందు, 21 (పిసిడబ్ల్యూ న్యూస్): సింగరేణిలోనే బొగ్గు వెలికి తీయడంలో ఇల్లందు ఏరియాలోని జెకె 5 ఉపరితల గని ప్రత్యేకంగా నిలుస్తుందనీ గత కొన్ని సంవత్సరాలుగా గనికి ఇచ్చినటువంటి వార్షిక లక్ష్యాన్ని గడువులోపే సాధి౦చి, ఉత్పత్తి సాధనలో ముందు వరుసలో ఉంటుందనీ,జెకె 5 ఉపరితల గనిలో 229 మంది ఉద్యోగులున్నారనీ, భద్రతాతో కూడిన ఉత్పత్తి కోసం ఉద్యోగుల౦తా కలిసికట్టుగా, ఒకరికి ఒకరు సహాయ సహకారాలతో ముందుకు సాగడంతోనే, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నా మనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 44 రోజుల ముందుగానే నిర్దేశిత 1మి.టన్న లక్ష్యాన్ని సాధించడం తో పాటు 104 శాతం ఉత్పత్తితో దూసుకుపోతున్నదనీ. గత ఆర్ధిక సంవత్సరం 2022-23 గాను సంస్థ నిర్దేశించిన 14.5 లక్షల టన్నులకు గాను 18.7 లక్షల టన్నులను ఉత్పత్తి చేసిందనీ గత సంవత్సరం 63 రోజుల ముందుగానే జెకె 5 నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించిందనీ. ఇల్లందు ఏరియా ప్రత్యేకం నిలుస్తుంది జి.యం.జాన్ ఆనంద్ తెలిపారు. ఇల్లందు ఏరియాలోని ఉద్యోగులంతా సమిష్టిగా ముందుకు సాగడంతో నిర్దేశిత ఉత్పత్తి సాధ్యమవుతుందని జెకె 5 ఉపరితల గని బొగ్గు నిక్షేపాలు తరిగిపోయినప్పటికీ సింగరేణి సంస్థ నిర్దేశించినటు వంటి వార్షిక లక్ష్యాన్ని 44 రోజుల ముందే సాధించడం చాలా సంతోషంగా ఉందని, జెకె 5 ఉపరితల గని ఏరియాకు వెన్నేముకలా నిలుస్తుందని, లక్ష్యసాధనలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడం, లక్ష్యసాధనలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా ఉత్పత్తి సాధించడంలో ఉద్యోగులు,అధికారులు మరియు కార్మిక సంఘం నాయకుల కృషి ఎంతో ఉందన్నారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అను నినాదంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నామని, వార్షిక లక్ష్యం సాధించడం కోసం కృషి చేసిన అధికారులకు, మరియు ఉద్యోగులకు అభినందనలు తెలిపి మిఠాయి పొట్లాలను ఉద్యోగులకు పంపిణీ చేశారు. కార్మికుల ఐక్యతతోనే ముందుకు- బొల్లం వెంకటేశ్వర్లు,ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగులంతా కలిసికట్టుగా ముందుకు సాగడంతోనే నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని సాధించామని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇచ్చిన గడువులోపే సాధించడం ఆనందంగా ఉందని, దీనికి కృషిచేసిన ఉద్యోగుల౦దరికి కృతజ్ఞతలు తెలిపారు. ముందస్తు ప్రణాళికలతోనే లక్ష్యసాధన- పులి పూర్ణచందర్,గని మేనేజర్లో ఉద్యోగులందరూ ఐక్య౦ ఉంటూ, లక్ష్యసాధనలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడంతోనే సంస్థా నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని 44 రోజులు ముందుగానే సాధించడం సంతోషంగా ఉందని, గని మేనేజర్ పులి పూర్ణచందర్ తెలిపారు. ఉద్యోగులసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారికి అందుబాటులో ఉంటూ, వారిలో ఒక ఒకరిగా ఉండటం వల్లనే భద్రతతో కూడిన ఉత్పత్తి సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ బొల్లం వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం అధ్యక్షుడు ఏజీ శివప్రసాద్, డీజీఎం పర్సనల్ జీవి మోహన్ రావు, గని మేనేజర్ పులి పూర్ణచందర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ చిన్నయ్య, సీనియర్ పర్సనల్ అధికారి సుధాకర్, పిట్ సెక్రటరీలు సంజీవ చారి, సేవ్య మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.