పరకాల, ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్): కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి. ఆయనతో పాటు పరకాల మాజీ ఎంపీపీ పావుశెట్టి సుకన్య. పరకాల అభివృదే తన లక్ష్యంగా పరకాల నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు పరకాల మాజీ ఎంపీపీ పావుశెట్టి సుకన్య, బిజెపి నాయకులు దుబాసి వెంకటస్వామి, బలబద్ర రాజు, దేవు శ్రీను కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేగా రెండు సార్లు పరకాల సర్పంచ్ గా , ఒకసారి జెడ్పీటీసీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన మొలుగూరి బిక్షపతి తెలంగాణ ఉద్యమకారుడు, పలువురిని ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత, పరకాలలో రాజకీయ చక్రం తిప్పగల వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజంతో పాటు కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]