Saturday, March 7, 2026

ఉపాధిహామీ పనికి వెళ్లి పాము కాటుతో మహిళ మృతి.

తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని ఉపాధి హామీ పని కోసం ఎల్లమ్మ గుట్టకు కందకాలు తవ్వుతూ ఉన్నప్పుడు ఎరుకలి యాదమ్మ (43) అనే మహిళ పాము కాటుకు గురైంది.ఆమెకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుండి డాక్టర్ సూచన మేరకు మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ యాదమ్మ మరణించడం జరిగింది.

Related Articles

Latest Articles