Tuesday, July 21, 2026

ఘనంగా బాలల దినోత్సవం.

తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని వివిధ పాఠశాలలో బాలల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మన దేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకి పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. కావున ఆయన పుట్టినరోజు నాడు బాలలంతా పండుగ చేసుకుంటారు. అందుకే ఈరోజు పిల్లలు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తారు. పిల్లలు సంతోషంగా వివిధ నాయకుల వేషధారణలో వచ్చి బాలల దినోత్సవం జరుపుకున్నారు.

Related Articles

Latest Articles