తెలంగాణ పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, పాసిగామ, వెంకటాపూర్ ధర్మపురి మండలం తిమ్మాపూర్ సహకార సంఘం పరిధిలోని స్తంభంపల్లి పాసిగామ వెంకటాపూర్ గ్రామాల లో వరి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ అధ్యక్షులు పత్తిపాక వెంకటేష్, తిమ్మాపూర్ సహకార సంఘం అధ్యక్షులు సాయిని సత్యనారాయణతో కలిసి ఆదివారం ప్రారంభించారు. పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని రైతులకు ఆయన సూచించారు. నాయిని సత్యనారాయణ మాట్లాడుతూ మాచర వచ్చే విధంగా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని రైతులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చల్లూరి రూపా రాణి, బొప్పా తిరుపతి రాందేని రామ ఎంపీటీసీ పోడేటి సతీష్ గౌడ్ ఉప సర్పంచ్ కొత్తూరి భూమయ్య సంఘ డైరెక్టర్లు రాందేని కోటయ్య యాగండ్ల మల్లేశం కంటెం తిరుపతి నాయకులు చెల్లూరి రామచంద్ర గౌడ్ సింగిల్ విండో అధికారులు పాలకవర్గ సభ్యులు మహిళలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]