Tuesday, July 21, 2026

పరకాలలో పరకాల క్రికెట్ లీగ్ ప్రారంభం.

పరకాల మండల కేంద్రంలో స్థానిక యువతను ప్రోత్సహించడానికి శివ 11 టీం ఆధ్వర్యంలో పరకాల క్రికెట్ లీగ్ ప్రారంభం. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా, చందుపట్ల రాజిరెడ్డి, పరకాల 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ , బిజెపి నాయకులు కానుగుల గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తా అన్నారు. శరీరాన్ని మరియు మనసును బలపరుస్తుందని అన్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల డిహైడ్రేషన్ లోనే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని ఎక్కువగా నీరు తీసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ. సాయంత్రం లేదా ఉదయం సమయంలో క్రికెట్ ఆడాలన్నారు.
ఈ కార్యక్రమంలో, రంజిత్, అశోక్, దిలీప్, శివ, రోహిత్, అజ్మీర సాయి, ఆకుల వెంకటేష్, సిద్దు, రాజేష్, నవి, టీవీ రాజు, గణేష్, ప్రశాంత్, యాకూబ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles