Saturday, March 7, 2026

మహాత్మ గాంధీకి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా..

సంగెం, జనవరి 30 (పిసిడబ్ల్యూ న్యూస్): 420 రోజుల కాంగ్రెస్ పాలనపై 420 మోసాలపై మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందచేత..మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా సంగెం మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి.. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాలమేరకు ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించి..ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించి..ఈ చేతకాని కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి ప్రసాదించి…ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలని మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందచేసారు.

Related Articles

Latest Articles