Saturday, March 7, 2026

పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ నగదు

పరకాల, మార్చి 31 (పిసిడబ్ల్యూ న్యూస్): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం పరకాల పోలీసులు పాత ఏటీఎం సెంటర్‌లో ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. చెల్లుబాటు అయ్యే పత్రం లేకుండా డబ్బును తీసుకొని వెళ్తున్న.. భూపాల్ పల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన గిరబోయిన చిన్ని తనిఖీల్లో రూ.1,65,000 నగదు స్వాధీనం చేసుకున్నారు . ఇట్టి మొత్తాన్ని సరైన రసీదు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని సరైన పరిశీలన కోసం పరకాల ఆర్డీవో ముగ్గురు సభ్యుల కమిటీ కి సరెండర్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.

Related Articles

Latest Articles