Wednesday, July 22, 2026

కార్తీక మాస వన సమారాధనలో. కొండ బాల..

పిసి డబ్ల్యూ ఉమ్మడి జిల్లా ప్రతినిధి: మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కార్తీకమాస వన భోజన సమారాధన కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్న వేళ బయ్యారం మండల కేంద్రంలో కమ్మ మహా జన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమాలలో రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల స్ఫూర్తిని గౌరవిస్తూ దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా 10 శాతం ఉన్నత వర్గ పేదలకు రిజర్వేషన్ ప్రకటించడం హర్షనీయమైనదని ఈ 10 శాతాన్ని అగ్రవర్ణ పేదలు ఉపయోగించడంలో ముందుండాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించబడిన ఉద్యోగాలలో ఉన్నత స్థాయిని పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్మ మహాజన సంఘం రాష్ట్ర,జిల్లా నాయకులు మరియు కమ్మ సంఘం ప్రముఖులు, కమ్మ సమాజం పాల్గొన్నారు.

Related Articles

Latest Articles