పరకాల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో పరకాల మున్సిపాలిటీ నూతన పాలక మండలి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి. పరకాల మున్సిపల్ చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పరకాల పట్టణంలో వివిధ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
