హన్మకొండ జనవరి 14 (పి సి డబ్ల్యు న్యూస్) : హనుమకొండ జిల్లా హసన్ పర్తి గంటూరుపల్లి హెచ్ పి గోదాం వద్ద హైవే పనులు చేస్తున్న టిప్పర్ అతి వేగంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న పాల వ్యాపారి ఈర కుశుడు (38) నీ డీ.. కొనగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా నుజ్జు నుజ్జు కాగా కుటుంబ సభ్యుల ఆర్త నాదాలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది కుశుడు కి భార్య 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని హసన్ పర్తి ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో హసన్ పర్తి పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
