పరకాల, జనవరి 09 (పిసిడబ్ల్యూ న్యూస్):ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో పిసిడబ్ల్యూ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా 2026 నూతన క్యాలెండర్ను కళాశాల ప్రిన్సిపాల్ డా. బేతి సంతోష్కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పరకాల పట్టణంలోని విద్యార్థులకు, మేధావులకు, ప్రజలకు నూతన సంవత్సరం–సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సేవలు అందించాలని పిసిడబ్ల్యూ న్యూస్ యజమాన్యాన్ని అభినందించారు. సమాజంలో జర్నలిస్ట్ పాత్ర అత్యంత కీలకమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్. ఎ. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్.టి. భీoరావు తదితరులు పాల్గొన్నారు.
